ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి *యంజాల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం*
హైదరాబాద్ - నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై భాగ్యనగరానికి అతి చేరువలోనున్న తుర్కయంజాల్ లో అత్యాధునిక సౌకర్యాలతో యంజాల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో, అనుభవజ్ఞులు అయిన వైద్య సిబ్బంది అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజలకు సేవ చేయాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆయన సూచించారు. అనంతరం ఆసుపత్రి ప్రతి విభాగాన్ని పరిశీలించారు. అనంతరం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ హాజరయ్యారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ అరవింద రావు, డాక్టర్ సాయి సతీష్, అరవింద్ రావు మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్స్, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యురో సర్జరీ, జనరల్ సర్జరీ అన్ని రకాల డిపార్ట్మెంట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మేనేజింగ్ డైరెక్టర్లు కార్యక్రమంలో ఎం ఓ డి విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ వెంకటరమణ వైద్య సిబ్బంది స్థానిక కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: