రెండు బైకులు ఢీ వ్యక్తికి తీవ్ర గాయాలు

Published: Thursday February 25, 2021
మధిర ఫిబ్రవరి 24 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మండలం కృష్ణాపురం బ్రిడ్జి దగ్గర రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తికి కుడికాలు విరిగింది ఇతనిది కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం అమ్మి రెడ్డి గూడెం గ్రామానికి చెందిన జక్కా నరసింహారావు వయసు 45 సంవత్సరాలు ఇతను స్వగ్రామం నుండి చింతకాని మండలం నాగులకొండ గ్రామంలోని తన కూతురు దగ్గరకు వెళుతుండగా కృష్ణాపురం బ్రిడ్జి దాటిన తర్వాత సిరిపురం నుంచి వస్తున్నాను బైక్ ఎదురుగా వచ్చి తగ్గడంతో ఇతనికి కుడి కాలు విరగడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతనిని అంబులెన్స్ లోకి ఎక్కించుకొని ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలెట్ రాజు అతనికి ప్రథమ చికిత్స అందిస్తూ అతని మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది