నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం

Published: Wednesday June 15, 2022
కరీంనగర్ జూన్ 14  ప్రజాపాలన ప్రతినిధి :
 
 ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీల పై బిజెపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, ఈ డి నోటీసులు పంపడాన్ని నిరసిస్తూ, టిపిసిసి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబ సభ్యులైన శ్రీమతి సోనియాగాంధీ ,రాహుల్ గాంధీలపై  కక్షపూరితంగా ఇడితో నోటీసులు పంపడాన్ని దేశవ్యాప్తంగా ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం సైనికులమై గర్జిస్తామని హెచ్చరించారు.దేశంలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను వేలం వేస్తూ, అమ్ముకుంటున్న మోడీకి ఈడీ నోటీసులు పంపి జైల్లో పెట్టాల్లన్నారు., ఎలాంటి మచ్చ లేని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పై  కక్షపూరితంగా నోటీసులు పంపుతున్నారన్నారు,దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ రకరకాలుగా ప్రజల్ని వంచిస్తూ, పెట్రోల్ ,డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, ప్రజలను రోడ్లమీద పడేస్తున్నారన్నారు, రూపాయి విలువ పడగొట్టి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నా బి జె పి నాయకులను జైల్లో పెట్టాలన్నారు, నాయకుల మీద ఈగ వాలినా చూస్తూ ఊరుకోబోమని బిజెపి నాయకులను వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు లింగంపల్లి బాబు, గుండాటి శ్రీనివాసరెడ్డి, విక్టర్ ,ఏజ్రా, ఎండి చాంద్ ,శబనా మహమ్మద్ ,మామిడి సత్యనారాయణ రెడ్డి, కొరివి అరుణ్ కుమార్, యనమల మంజుల, షాహిన్ షా ,దండి రవీందర్ ,సలీమ్ ఉద్దీన్,  ముక్క భాస్కర్, నదీం, జీలకర్ర రమేష్, కుంభాల రాజు కుమార్, తదితరులు పాల్గొన్నారు.