ఉపాధ్యాయులను అభినందించిన ఏలూరి శ్రీనివాసరావు..
Published: Thursday January 05, 2023
కొణిజర్ల, జనవరి 4 (ప్రజాపాలన న్యూస్): కొణిజర్ల మండలం మండలంలోని సింగరాయపాలెం గ్రామంలో ఉపాధ్యాయులను బీఅర్ఎస్ జిల్లా నాయకులు, స్థానిక నేత బుధవారం అభినందించారు.
కొణిజర్లలో నిర్వహించిన టిఎల్ఎం ప్రదర్శన కార్యక్రమములో ప్రాథమిక పాఠశాల సింగరాయపాలెం ఉపాధ్యాయులు కరుణా, శ్రీ విద్యా తయారుచేసి విద్యార్థులకు బోధిస్తున్న బోధనోపకరణాలను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి ప్రథమ బహుమతిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ శంకర్ తో పాటు ఉపాధ్యాయులను ఉపాధ్యాయులను నాయకులు ఏలూరి శ్రీనివాస్ రావు అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి విద్యా బోధన చేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు.
Share this on your social network: