బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్
Published: Thursday November 11, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : బుగ్గరమలింగేశ్వర స్వామి దేవలయ ఆవరణంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే. మంచిరెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధుల సి డి ఎఫ్ నుండి 5లక్షల రూపాయలతో సీసీ రోడ్డును కేటాయించడం జరిగింది, ఈ రోడ్డు పనులను ఈ రోజు గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇలాగే గ్రామానికి, బుగ్గ టెంపుల్ అభివృద్ధి నిధులను మంజూరు చేయాలని, మరింత అభివృద్ధి సహకరించాలని మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కోరారు. వారి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వార్డు సభ్యులు పంబల శివ కుమార్, తులసి లచ్చిరాం, వెంకటేష్, స్వప్న సురేష్, SD. సద్దాం, మాజీ ఎంపీటీసీ శ్రీకాంత్, గ్రామస్థులు వస్పరి కుమార్, జంగచారి, యాదగిరి రెడ్డి, MD జానీ పాషా, పున్నం రాములు, మహేందర్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: