ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Published: Tuesday January 31, 2023
మేడిపల్లి, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి)
 ఉప్పల్ సర్కిల్ పరిధిలోని రామంతాపూర్ చర్చి స్కూల్ 1993 సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం సోమవారం ఘట్కేసర్ లోని ఉదయలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు వారి అనుభవాలను పంచు కొన్నారు. పూర్వ విద్యార్థులు శ్రీనివాస్ రెడ్డి రియల్ ఎస్టేట్, డేవిడ్ రాజు ఆస్ట్రేలియా రిటన్ ,ధనుంజయ గౌడ్ టిఆర్ఎస్ మలిదశ ఉద్యమ కారుడు, బిక్షమయ్య వ్యాపారం , శ్రీనివాస్ రియల్ ఎస్టేట్, జంగయ్య, అనిల్, సుధాకర్ ,ఉదయలక్ష్మి సైకాలజిస్ట్, రోజా రాణి డి ఆర్ డి ఓ,  లూసి మేరీ  గవర్నమెంట్ టీచర్, యాదలక్ష్మి గవర్నమెంట్ టీచర్, మరియాదాస్ బ్యాంక్ ఎంప్లాయ్, మంజుల కండక్టర్, ఉమారాణి బ్యూటిషన్, బిందు ప్రైవేట్ పరంజ్యోతి మ్యారేజ్ బ్యూరో, భవాని ,కవిత, అనిత వెంకటలక్ష్మి, మంజుల, కవిత సంగారెడ్డి మాధవి గ్రానైట్ షాప్, రాధా, మాధవి ,భాగ్యలక్ష్మిలు ఉన్నారు.