పత్తిపాక లో తెరాస గడపగడపకు ప్రచారం
కోరుట్ల, అక్టోబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి):
మునుగోడు నియోజకవర్గంలోని పత్తిపాక గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం శుక్రవారం కోరుట్ల పట్టణ టిఆర్ఎస్ యూత్ ఉపాధ్యక్షుడు బలిజ శివప్రసాద్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు పత్తిపాక గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వృద్ధులకు, మహిళలకు, వితంతువులకు ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్లు అందించిన ఘనత కేసిఆర్ దేనని తెలిపారు. గ్రామంలోని ప్రజలు టిఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు.కెసీఆర్ ను పెద్ద కొడుకు అని అంటున్నారని ఆయన తెలిపారు . ఆయన వెంట గ్రామ టిఆర్ఎస్ ఉపాధ్యక్షుడు యాదగిరి, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆదిత్య, జాల నరసింహ, తడక వెంకటేశ్వర్లు, సిపిఎం కార్యకర్తలు ముంత సాయి, భాస్కర్ తదితరులు ఉన్నారు.
Share this on your social network: