నెహ్రూ సెవలు మరవలేనివి. .. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్.

Published: Tuesday November 15, 2022
జన్నారం, నవంబర్ 14, ప్రజాపాలన:  
 

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, తొలి భారత ప్రధాని పండిత్ జవహర్ లాల్  నెహ్రూ 133 వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ పసీ ఉల్లా ముఖ్య అతిథిగా హాజరై జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేహ్రు దేశ స్వతంత్ర పోరాటంలో గాంధీ  తో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారన్నారు. భారత దేశ స్వతంత్ర సంగ్రామ సమయంలో కీలక పాత్ర పోషించారన్నారు. చాచా నెహ్రు కు పిల్లలంటే చాలా అమితమైన ప్రేమ అందుకని, అప్పటి ప్రభుత్వం పిల్లల దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు. ప్రతి ఏడాది నవంబర్ 14న దేశమంతటా చిల్డ్రన్స్ డే ను ఘనంగా జరుపుకుంటారన్నారు. నెహ్రూ ఈదేశానికి చేసిన సేవలు మరవలేనివని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దుమాల రమేష్, మండల సి సెల్ అధ్యక్షుడు మామిడిపల్లి ఇందయ్య, సీనియర్ నాయకులు ఏ దేవయ్య, అమృతారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మజ్జు, ప్రవీణ్, బచ్చలి శివ సునీల్, సాయి, తదితరులు పాల్గొన్నారు.