నేలపట్ల గ్రామంలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరు

Published: Monday September 26, 2022

చౌటుప్పల్, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు నియోజక వర్గానికి చేసింది ఏమీ లేదని

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లో పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎన్నో సేవలు చేశారని వారి కూతురుగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పాల్వాయి స్రవంతి చేతిగుర్తుకు ఓటువేసి గెలిపించుకునే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాల అవలంబిస్తున్నాయని మునుగోడు ఉప ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కోడెం రాములు, కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన విద్యార్థి సంఘం నాయకులు, పాల్గొన్నారు.