ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి సిఐటియు ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా

Published: Friday February 03, 2023

బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండల సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కో కన్వీనర్ గుగులోత్ నరేష్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటే అదనపు పారితోషకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కారం కానీ పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల నాయకురాలు రావణ సరోజినీ, ఆశా వర్కర్లు గంగుల విజయలక్ష్మి, మరీదు లీలా కుమారి, దుర్గ, గద్దె తులసి, మండలంలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు.