ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి : డిఆర్డిఓ శేషాద్రి.

Published: Friday June 11, 2021

జన్నారం, జూన్ 10, ప్రజాపాలన  ప్రతినిధి: రాబోవు హరితహారం ఈ కార్యక్రమానికి ముందుగానే ప్రణాళిక లు సిద్ధం చేసుకోవాలని డి ఆర్డిఓ శేషాద్రి సూచించారు. గురువారం జన్నారం దండేపల్లి మండలాలకు చెందిన ఉపాధి హామీ పనులపై ఉపాధి హామీ సిబ్బందితో సమావేశాన్ని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా డి ఆర్ డి ఓ శేషాద్రి ఉపాధి హామీ పనులను అన్ని గ్రామాలలో ఎక్కువమంది లేబర్ లతో చేయించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఎంపీడీవో అరుణ రాణి దండ పల్లి ఎంపిడిఓ శ్రీనివాస్ ఈ రెండు మండలాలకు చెందిన ఏ పీ ఓ లు ఈసీలు  టి ఏ లు పాల్గొన్నారు