మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం

Published: Thursday December 15, 2022
బోనకల్ డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం డిటిసిపిఓ ఎస్ వి ప్రసాద్ తో కలిసి లేఅవుట్లు, భవనాల అనుమతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఈజీఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిటిసిపిఓ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యదర్శులకు పంచాయతీ కార్యకలాపాలపై సూచనలు తెలియజేశారు. అదేవిధంగా సీడ్ డిబ్లింగ్, అంకురార్పత్తి, సంచుల మార్పిడిపై మండల గ్రామపంచాయతీ కార్యదర్శులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మోటమర్రి పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, ఎంపీ ఓ సుబ్రహ్మణ్య శాస్త్రి, ఏ పీ ఓ బసపోజు కృష్ణకుమారి,మండలంలోని అన్ని గ్రామపంచాయితిల కార్యదర్శులు పాల్గొన్నారు.