విద్యుత్ లైన్ల మరమ్మతు

Published: Wednesday September 15, 2021
బోనకల్లు, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా సైదా నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను విద్యుత్ లైన్ల మరమ్మతు పనులను విద్యుత్ సిబ్బంది చేత ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు గ్రామపంచాయతీ సర్పంచ్ దృష్టికి తీసుకు రావడంతో విద్యుత్ మరమ్మతు పనులు త్వరితగతిన చేపట్టకపోతే గ్రామ ప్రజలు విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున సర్పంచ్ సైదా నాయక్ విద్యుత్ శాఖ సిబ్బంది తో మాట్లాడి పనులను యుద్ధ ప్రాతిపదికన ముమ్మరంగా చేపడుతున్నట్లు సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సైదా నాయక్, విద్యుత్ శాఖ సిబ్బంది నగేష్, రాజేష్ పంచాయతీ సిబ్బంది షేక్ దస్తగిరి, నాగరాజు, రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.