ఆళ్లపాడు నర్సరీ నీ తనిఖీ చేసిన జిల్లా ఎన్ఆర్ఈజీఎస్ ఏడి శ్రీనివాసరావు

Published: Thursday December 29, 2022
 బోనకల్, డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామం లో 2023 నూతన సంవత్సరానికి గాను నర్సరీలను గ్రామపంచాయతీలో ఏర్పాటు చేయడమైనది. నర్సరీలో పేంచుతున్న మొక్కల పెంపకాలను బుధవారం ఎన్ఆర్ఈజీఎస్ ఏడి శ్రీనివాసరావు తనిఖీ నిర్వహించగా అట్టి నర్సరీలో గులాబీ మొక్కలు పూలతో ఉన్నాయి. అట్టి పూలతో గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు వారికి అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో విజిఎస్ బిసి కిరణ్ కుమార్, పిసి రంజిత్తు కుమార్, పంచాయతీ కార్యదర్శి పరుశురాం, పిల్డ్ఆస్టీంటు సైదాబి, పంచాయతీ సిబ్బంది వన్ సేవకు రాలు పాల్గొన్నారు.