మేదరుల సమస్యల పరిష్కారానికి కృషి . జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

Published: Tuesday September 20, 2022

ఆసిఫాబాద్ జిల్లా , సెప్టెంబర్ 18 , ప్రజాపాలన,ప్రతినిధి :

 

మేదరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్క్ లో ఆదివారం నిర్వహించిన ప్రపంచ మేధారుల దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మేదర్లు వెదురుతో అల్లిన అల్లిక లను పరిశీలించారు. అనంతరం పేదలను ఉద్దేశించి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కులవృత్తిని వదులుకోవద్దని, భవిష్యత్ తరాలకు ప్రస్తుత తరం వారధిగా ఉండాలని సూచించారు.

మేధావుల సంఘం నాయకులు మాట్లాడుతూ కే బి జిల్లాలో మేదరులపై అటవీ అధికారుల దాడులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి సంఘ భవనం కోసం జిల్లా కేంద్రంలో ఎకరం స్థలం మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కనకయ్య,శ్రీనివాస్,అరుణ్, మేధావుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.