తాసిల్దార్ జగదీశ్వర్ ప్రసాద్ కి వినతిపత్రం అందజేత

Published: Wednesday January 12, 2022
ఎర్రుపాలెం జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని రేమిడిచర్ల గ్రామానికి చెందిన రవణ బీడు భూములకు సంబంధించిన లబ్ధిదారులకు పాసు పుస్తకాలు ఇవ్వాలని ఎర్రుపాలెం తాసిల్దార్ జగదీశ్వర్ ప్రసాద్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీ చావా రామకృష్ణ, రేమిడిచర్ల సర్పంచ్ పురుషోత్తం రాజు, రామాపురం సర్పంచ్ కొమ్మురి గోపాలరావు, మండల యువజన అధ్యక్షులు కొండపాటి సాంబశివరావు, రైతు సమన్వయ సమితి మండల కమిటీ సభ్యులు బొర్రా మురళి మోహన్ రావు, కొట్టే శ్రీనివాసరావు, బుడిగెలి ప్రకాష్, వినతి పత్రాన్ని తాసిల్దార్ జగదీశ్వర ప్రసాద్ కి అందజేసినారు.