డివిజన్లోని సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్ చేతన హరీష్

Published: Thursday June 30, 2022
మేడిపల్లి, జూన్29 (ప్రజాపాలన ప్రతినిధి)
 హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ ప్రజా సమస్యలపై డివిజన్లోని శ్రీనివాసపురం వీధి నంబర్ ఒకటిలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకు వచ్చారు. వరదనీటి కాలువ పూర్తిగా మట్టితో కూరుకుపోయిఉందని, వర్షం వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, కొత్తగా వరద నీటికాలువ నిర్మించాలని కోరారు. అదేవిధంగా రోడ్డు చాలా సంవత్సరాల క్రితం వెసారని మొత్తం పాడైపోయిందని కోత్త సిసి రోడ్డు వేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ సమస్యలు అన్ని తీరుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ అధికారులు డీఈ నాగమణి, ఏఈ కీర్తీ, స్థానికులు రవీందర్,అచ్యుతరావు, శ్రీనివాస్, పటియా, పంతులు, నాంచారి, బిజెపి ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి తదితరులు పాల్గొన్నారు.