జయసారధిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి : పొన్నం వెంకటేశ్వర్రావు

Published: Tuesday March 09, 2021

మధిర, మార్చి 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మెయిన్ రోడ్ లో సిపిఐ సీపీఎం, ప్రజాసంఘాల నాయకులతో కలసి సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్రావు గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్ల తో మాట్లాడుతూ కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగాన్ని ప్రయివేట్ పరం చేస్తానని చెప్పడాన్ని ప్రతి నిరుద్యోగ యువకులు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగం బతికుంటేనే ఉద్యోగ ఉపాధి అవకాశలు, రిజర్వేషన్ లు, ఉద్యోగ భద్రత ఉంటుందని తెలిపారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో కుటుంబ పాలన జరుగుతుంది. నిరుద్యోగ భృతి లేదు, నియామకాలులేవు, కోటి ఎకరాలకు నీళ్లు లేవు ఒక్క ప్రాజెక్టు పూర్తిగాలేదు, కానీ ఇంటికో ఉద్యోగం కెసిఆర్ ఇంట్లో, నీళ్లు కెసిఆర్ ఫామ్ హౌస్ లో, నిధులు ప్రగతి భవన్లో, మాత్రం చేరాయని విమర్శించారు మేధావులైన మధిర ప్రాంత ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగులు ఏకమై ప్రజాసమస్యలపై అలుపెరుగనిపోరాటం చేసే వామాపక్షాలు బలపరచిన జయసారధి రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీజేపీ టీ ఆర్ ఎస్ పార్టీ లకు గుణపాఠం చెప్పాలని ఓటర్ల ను కోరినారు. ఈ ప్రచారంలో సిపిఐ సీపీఎం పట్టణ, మండల కార్యదర్శులు బెజవాడ రవి, శీలం నర్సింహారావు, ఊట్ల కొండ, మందా సైదులు, పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు, చెరుకూరి వెంకటేశ్వరరావు, ప్రభాకర్, మధు, మురళి, రామాంజయ్య, అనిల్ పాల్గొన్నారు.