రాయపోల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ* *సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్పంచ
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి.ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో సొంత డబ్బులతో విద్యార్థులకు నోట్ బుక్స్ డొనేట్ చేస్తున్న రంగారెడ్డి జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై 415 మంది విద్యార్థులకు *ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షులు బూడిద రామ్ రెడ్డి గారితో కలిసి విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు,అదేవిధంగా విద్యార్థుల భోజనశాల ను పరిశీలించారు, తదుపరి రాయపోల్ గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ని కూడా సందర్శించారు,ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బుగ్గరాములు, సర్పంచ్ బల్వంత్ రెడ్డి, ఎంపీడీవో క్రాంతి కిరణ్,స్కూల్ ప్రిన్సిపాల్,ఉప్పసర్పంచ్ బాలరాజ్, ఎంపీటీసీలు శ్రీశైలం,జ్యోతిభాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బాలు గౌడ్, శ్రీకాంత్, మరియు స్కూల్ యాజమాన్యం విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: