సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Published: Friday June 03, 2022

మధిర 2 జూన్ ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలోని గురువారం నాడు డు
సిపిఐ మధిర మండల కమిటీ ఆధ్వర్యంలో మడుపల్లి లో పార్టీ ఆఫీస్ దగ్గర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముందుగా జాతీయ పతాకాన్ని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి ఆవిష్కరించారు.
ఈసందర్బంగా బెజవాడ రవి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో సిపిఐ క్రియాశీలక పాత్ర పోషించిందని ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా నినాదాన్ని వినిపించిన ఏకైక పార్టీ సిపిఐ అని కొనియాడారుఎందరో అమరవీరుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణా లో ఉద్యమ ఆకాంక్షలు పూర్తిగా నెరవేరలేదని అన్నారు.నాటి నిర్భందాలకు వెరవకుండా పోరాడి తెలంగాణా సాధన లో పాల్గొన్నవారికి  ఉద్యమ అభినందనలు తెలిపారు.ఈకార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు, జిల్లా సమితి సభ్యులు ప్రకాశరావు, సిపిఐ మండలకమిటి సభ్యులు రామానుజం, చెరుకూరి, కామేశ్వరరావు, హనుమంతరావు, కొండా, మడుపల్లి సహాయ కార్యదర్శి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు