తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు కలిసిన జడ్పిటిసిలు కామిరెడ్డి శ్రీలత, పో

Published: Wednesday November 16, 2022

ఈరోజు హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ని మర్యాదపూర్వకంగా కలిసిన.... మణుగూరు  జడ్పిటిసి పోశం నరసింహారావు, బూర్గంపాడు  జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత , మణుగూరు మండలం బిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బిఆర్ఎస్  సీనియర్ నాయకులు కామిరెడ్డి రామ కొండారెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  తో పార్టీ నాయకులు ప్రత్యేక సమావేశమై  అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి మరియు తదితర అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగినదని వారు తెలియజేశారు. పినపాక నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయల నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేపించి అభివృద్ధి చేస్తానని మరియు ఇప్పటికే ఏజెన్సీ గ్రామాలలోని మారుమూల గ్రామాలకు సైతం రహదారుల నిర్మాణం సంబంధించి పనులు జరుగుతున్నాయని, అదేవిధంగా చెక్ డ్యామ్ లు, కల్వర్టులు, బ్రిడ్జిలు, రోడ్లు లు, సంబంధించి నిధులు కూడా మంజూరు అవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు ,నాయకులకు వారు తెలియజేసారని  తెలిపారు.