మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

Published: Friday January 27, 2023

జన్నారం, జనవరి 26, ప్రజాపాలన:  మండలంలో ఘనంగా 74 గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీ కార్యాలయలలో అయా గ్రామాల సర్పంచులు త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి మాదాడి సరోజన, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దుమాల రమేష్, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు చందు మరియు పలు పార్టీల అధ్యక్షులు జాతీయ పథకాన్ని ఎగురవేశారు. అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ డి వో మాదావరావు, తాహసిల్థర్ కార్యాలయంలో  ఇట్యాల కిషన్ పోలిస్ బందోబస్తుతో జాతీయ జెండా ను ఎగురవేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మువ్వన్నెల జేండా పండగా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వెనుక భాగంలో అంజలి హోమియో క్లినిక్ ను ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అజ్మీర రేఖనాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.