ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి *పెండింగ్ అక్రిడేషన్ కార్డుల జారీకి గ్రీన్ స

Published: Wednesday November 30, 2022
రంగారెడ్డి జిల్లా పరిధిలో వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టుల రెండవ విడత అక్రిడేషన్ కార్డుల జారీకి జిల్లా అక్రిడేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన కమిటీ సమావేశంలో అర్హులైన జర్నలిస్టులకు కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కమిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్, కమిటీ సభ్యులు, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాధం రమేష్, సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, విష్ణు, సత్యనారాయణ, సయ్యద్ జాఫర్ హుస్సేన్, డిపిఆర్ఓ పద్మశ్రీ తదితరులు ఉన్నారు.

*డిసెంబర్ 5వ తేదీ నుంచి డీపిఆర్ఓ కార్యాలయంలో కార్డులు తీసుకోండి: శేఖర్ సాగర్*
రంగారెడ్డి జిల్లా పరిధిలో వివిధ సంస్థలలో పనిచేస్తూ అక్రిడేషన్ కార్డుల కోసం ధరఖాస్థులు పెట్టుకున్న అర్హులైన జర్నలిస్టులు రెండవ విడత లో భాగంగా డిసెంబర్ 5 వ తేది నుంచి జిల్లా పౌరసంబందాల అధికారి కార్యాలయంలో కార్డులు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ సూచించారు.