ఇంటర్మీడియట్ ఫలితాలలో సుశీల విద్యార్థులు ప్రభంజనం

Published: Wednesday June 29, 2022
మధిర జూన్ 28 ప్రజా పాలన ప్రతినిధిరాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో స్థానిక సుశీల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సుశీల జూనియర్ కళాశాల విద్యార్థులు అన్ని గ్రూపులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మధిర పట్టణ ఆల్ టైం రికార్డు సృష్టించడం జరిగిందని  కళాశాల యాజమాన్యం ప్రకటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఎంపీసీ గ్రూపులో తన్మయ 470 కి 465 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకును సాధించారు.  జి.దివ్య అనూష,464 మార్కులు వి.తనిష్క 463 మార్కులు సాధించారని వారు తెలిపారు.
అలాగే బైపీసీ గ్రూపులో 440 కి 435 మార్కులను సహస్ర సాధించగా,431 పార్కులు షేక్ గుల్షన్, వర్షిత సాధించడం జరిగిందని వారు పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సర ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులకు 987 మార్కులను ఎం.రిత్విక, కె.సాహితీ సాధించగా,986 మార్కులు ఎస్.శరణ్య,984 మార్కులు ఎం.ప్రణీత సాధించారు బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు 967 మార్కులు వి.నాగజ్యోతి  సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ నరసింహారావు, ఏ.ఓ హరినాధ్, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.