నవంబర్ 12 న గీతాంజలి దేవశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి):

Published: Wednesday November 09, 2022
నవంబర్ 12 న ఓపస్ ఆర్జెంటమ్ పేరుతో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు  గీతాంజలి దేవశాల  అసోసియేట్ డైరెక్టర్ మాధవీ చంద్ర.గీతాంజలి దేవశాల 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యం తో 1997 లో ప్రారంభమైన గీతాంజలి దేవశాల గత 25 సంవత్సరాల నుండి సేవలందిస్తూ నేడు నర్సరీ నుండి పదవ తరగతి వరకు 1200 మంది విద్యార్థినీ,విద్యార్థులతో రాష్ట్రం లోనే కాక దేశవ్యాప్తంగా తమ విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్నారన్నారు, ప్రతీ టీచర్ విద్యార్థుల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నారని, తమ స్కూల్ నుండి ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు అందుకున్న వారు ఉన్నారన్నారు.ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారని ఆమె తెలిపారు.ఈ  కార్యక్రమం లో ఆమెతో పాటు పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ అంజనా మూర్తి, షాలిని తదితరులు పాల్గొన్నారు.