వివాహం అన్ని విషయాల్లో ఘనమైది

Published: Thursday September 29, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి వివాహం అన్ని విషయాల్లో ఎంతో ఘనమైనధని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు రాజమణీ దంపతులు పేర్కొన్నారు. బుధవారం బైబిల్ మిషన్ పెరువంచ పాస్టర్ బేతంపూడి మహిమాకర్ తేజ, మంజుల వివాహం పెనుబల్లి సప్తపది కల్యాణ మండపంలో బైబిల్ మిషన్ సత్తుపల్లి పాస్టర్ రెవ.బి.వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాద రావు రాజమణి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వధూవరులు కష్టంలోనూ సుఖంలోనూ అన్ని విషయాల్లో కలిసిమెలిసి ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యాక్రమంలో బైబిల్ మిషన్ పెనుబల్లి పాస్టర్ రాకడ రాజు, బేతంపూడి మర నాదరావు నిర్మల రాణి జిల్లా కోర్టు న్యాయవాది మద్దెల నవీన్ కుమార్ దీవెన దంపతులు పాల్గొన్నారు.