బిజెపికి అడుగడుగున బ్రహ్మరథం

Published: Wednesday September 21, 2022
రాష్ట్ర బిజెపి నాయకులు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజా పాలన : బిజెపికి అడుగడుగునా ప్రజల బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర బిజెపి నాయకులు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కొనియాడారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని జిల్లా అధ్యక్షుడు సదాన్ రెడ్డి పట్టణ బిజెపి అధ్యక్షుడు తూర్పు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని వివిధ కాలనీల లో మాజీ మంత్రి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ పాదయాత్ర నిర్వహించారు. వివిధ కాలనీలో ప్రజలతో వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టినట్టు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని  వారన్నారు. రాబోవు రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్య ,ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని రైతులకు రుణమాఫీ చేయకుండా రైతుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి
ఇస్తామని నమ్మబలికి సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగుల ఓట్లతో గద్దినేక్కిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారని అన్నారు. రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏలు గత 58 రోజులుగా సమ్మె చేస్తున్న వారిని పట్టించుకునే సోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కి లేదని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని వికారాబాద్ పట్టణంలో సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు ఆయన మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.