తుమ్మలను కలిసిన ముస్లిం మతపెద్ద నాగుల్ మీరా..

Published: Wednesday September 21, 2022
తల్లాడ, సెప్టెంబర్ 20 (ప్రజాపాలన న్యూస్): 
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామానికి చెందిన ముస్లిం మతపెద్ద బేగ్ నాగుల్ మీరా మంగళవారం కలిశారు. తుమ్మల స్వగ్రామమైన గండుగలపల్లి గ్రామంలో ఆయనను వారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. తుమ్మలను  కలిసిన వారిలో ముస్లిం మత పెద్దలు బేగ్ నాగుల్ మీరా, పఠాన్ అక్బర్, షేక్ సలీం, షేక్ సైదా, కాంపాటి పుల్లారావు ఉన్నారు.*