ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో డివిజన్ మరింత అభివృద్ధి : కార్పొరేటర్ ఉప్పలపాటి

Published: Tuesday August 30, 2022
శేరిలింగంపల్లి -ప్రజా పాలన/ఆగస్ట్ 22  :శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గాంధీ సహకారంతో డివిజన్ అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తూ, దశలవారగా స్థానికంగా నెలకొన్న సమస్యలన్నిటిని పరిష్కరిస్తున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. సోమవారం మియాపూర్ డివిజన్ పరిధిలోనీ చిరంజీవి నగర్ కాలనీలో పలు సమస్యలపై అలాగే డివిజన్ లో చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ వాసులతో కలసి పాదాయాత్ర నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ చిరంజీవి నగర్
కాలనీ అభివృధి కృషి చేస్తామని కాలనీలో మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. నిరంతరం కాలనీ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులు, రోడ్లు డ్రైనేజి, మంచినీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మియాపూర్ డివిజన్ ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తున్నామని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి విడతల వారిగా అందుబాటులోకి తీసుకువచ్చేల కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నడి మింటి కృష్ణ, రమేష్, బీమాయ్యా, రాంచందర్, శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, సిద్ధరెడ్డి, గంగారాం శ్రీనివాస్, నజీర్, నవీన్, నితిన్, విజయ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.