అభివృద్ధిలో దూసుకుపోతున్న బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.

Published: Friday December 16, 2022
బూర్గంపాడు ( ప్రజా పాలన.)
బూర్గంపహడ్ మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉడ్ యార్డ్ గ్రామం నుంచి స్మశానవాటిక వరకు 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న గ్రావెల్ రోడ్డు పనులను పరిశీలించిన బూర్గంపహడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత అనంతరం గ్రామంలోని స్థానిక యువత జడ్పీటీసి ని కలిసి వాలీబాల్ ఆడుకోవడానికి క్రీడా సామాగ్రిని వితరణ చేయాలని కోరగా వెంటనే స్పందించి వాలీబాల్ కిట్ ని అందజేసిన జడ్పీటీసీ శ్రీలత ఈ కార్యక్రమంలో పిఆర్ ఏఈ వెంకటేశ్వర్లు, స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,తాటి శ్రీనివాస్,స్థానిక బిఆర్ఎస్ నాయకులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,వీరబోయిన సంజీవ రావు,పాయం నాగమణి,పాయం రాంబాబు మరియు స్థానిక యువత పాల్గొన్నారు.