బహుజనులు కదలిరండి ఆగస్టు 8 తేదీన జరగబోయే గర్జన సభకు తరలి రావాలి

Published: Tuesday August 03, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 2, ప్రజాపాలన ప్రతినిధి : యాచార0 మండలం మెండి గౌరెల్లి గ్రామంలో ఆగస్టు 8వ తేదీన RS ప్రవీణ్ కుమార్ సార్ బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తున్న శుభ సందర్భంగా మీరు కూడా బహుజన్ సమాజ్ పార్టీలోకి రావాలని, ప్రవీణ్ సార్ గారికి మద్దతు తెలపాలని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు గ్యార మల్లేష్ ఆయన మాట్లాడుతూ రాబోయేది బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రోజున వేదికను ఏర్పాటు చేసి తారీకున జరగబోయే కార్యక్రమానికి కదలిరావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు అసెంబ్లీ ఇంచార్జ్ పల్లాటి రాములు , అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ధార యాదగిరి. అసెంబ్లీ కోశాధికారి కంబాలపల్లి శాంత . కురిమిద్ద కుమార్ .  మెoడి గౌరెల్లి గ్రామ యువకులు పాల్గొన్నారు..