ఆక్సిజన్ కాన్స ట్రేటర్లు ఉపయోగించుకోవాలి బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు
Published: Wednesday June 09, 2021
వలిగొండ ప్రజా ప్రతినిధి : కరోనా కష్ట కాలంలో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాటానికి ఆక్సిజన్ కాన్సట్రేటర్లను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్రమోడీ ఏడూ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాయు మిత్ర, సేవహి సంఘటన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో బీజేపీ నాయకులు గూడూరు నారాయణరెడ్డి స్నేహితుడి కూతురు అట్లూరి ఉమ యు ఎస్ ఎ వారి సహకారంతో నిమిషానికి 7 లీటర్ల ఉత్పత్తి చేయగల ఆక్సిజన్ కాన్సట్రేటర్ ని 3 బీజేపి సీనియర్ నాయకులు బోళ్ల సుదర్శన్, గూడూరు నారాయణరెడ్డి, చేతుల మీదగా అందజేయడం జరిగింది, పార్టీలకి అతీతంగా కరోనా బారిన పడిన వారు ఎవరైనా ఈ ఆక్సిజన్ కాన్సిటేటర్స్ ఉపయోగించుకోగలరని వారికి అవసరం ఉంటే బీజేపీ మండల శాఖ వారిని సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఉప సర్పంచ్ మైసోళ్ల మత్స్యగిరి, వార్డు మెంబర్ దోగిపర్తి సంతోష్, కనతల అశోక్ రెడ్డి, గోకికర్ బన్సీలాల్, అప్పీశెట్టి సంతోష్, గట్టు రాజు, మెదరి నరేష్, బార్ల మల్లేష్, మైసోళ్ల మత్స్యగిరి, బుంగమట్ల మహేష్, ఎల్లంకి సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: