మేజిషియన్ ​పీసీ సర్కార్ జయంతి ఉత్సవాలను ప్రాంభించిన అధికారులు

Published: Wednesday February 24, 2021
గొల్లపల్లి, పిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): ​రవీందర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పోలీసు వారి సౌజన్యంతో పి.సి.సర్కార్ పుట్టినరోజు సందర్భంగా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ నుండి గుంజపడుగు, తిరుమలపురం(పీడీ), రంగదామునిపల్లి, లక్ష్మీపురం, చిల్వకోడూర్, ఎక్స్ రోడ్ నుండి చిల్వకోడూర్ ఊర్లో వరకు పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన గుర్రం శ్రీనివాస్ కళ్లకు గంతలు కట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది హీరో ఎక్స్ట్రీమ్ బండి పై శ్రీనివాస్ కూర్చోగా ఎస్ ఐ బలిజేపల్లి జీవన్, బండి స్టార్ట్ చేయగా స్థానిక తాసిల్దార్ నవీన్ ఎం పి డి ఓ జనార్దన్, పూలమాలలు వేయగా జెడ్పిటిసి ఎంపీపీ నక్కశంకర్, జలంధర్, సింగిల్విండో చైర్మన్ రాజసుమన్ రావు, జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నిశాంత్ రెడ్డి సంస్థ చైర్మన్ రవీందర్ తో పాటు భోధనపు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, కనుకుట్ల మహిపాల్ రెడ్డి, చౌటపల్లి తిరుపతి, అంకం భూమయ్య, సజ్జనపు అశోక్, మారంపల్లి బాబు, కచ్చు కొమురయ్య, చెవులమద్ది శ్రీనివాస్, రమేష్ సజ్జనపు జనార్ధన్, నేరెళ్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు.