ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 8 ప్రజా పాలన ప్రతినిధి

Published: Thursday March 09, 2023
**ఎమ్మెల్యే చొరవతో  బొక్కల కంపెనీ మూసివేత
మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపిన గ్రామస్తులు**

* యాచారం మడలం పరిధిలోని కాలుష్యకారక  కొత్తపల్లి ఆగ్రోఫీడ్స్ బొక్కల కంపెనీని మూసివేస్తున్నాం : ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి.
కాలుష్యాన్ని , దుర్వాసనలను వెలువరిస్తున్న కొత్తపల్లి గ్రామంలోని ఆగ్రోఫీడ్స్ బొక్కల కంపెనీని మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించినట్లు ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోరికమేరకు ఈ కంపెనీ మూసివేయాలని తాను చేసిన ప్రతిపాదన మేరకు ప్రభుత్వం సానుకూలంగా ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. సత్తు వెంకటరమణారెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ , రంగారెడ్డి జిల్లా.*