ఆరుట్ల నుండి నారాయణపూర్ వరకు బస్సులు నడపాలి
Published: Thursday December 02, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 1ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు బుధవారం సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ఇబ్రహీంపట్నం బస్ డిపో మేనేజర్ బాబు నాయక్ ని కలిసి ఆరుట్ల నుండి హైదరాబాద్ కు మరియు ఆరుట్ల నుండి నారాయణపురం వరకు బస్ సర్వీస్ లు నడుపుట గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అనంగల్ల యాదయ్య, మాజీ కో ఆప్షన్ సభ్యులు సలాం, సుంకరి ప్రవీణ్ కుమార్, పోలమోని రాజు, వస్పరి కుమార్ తదతరులు పాల్గొన్నారు.
Share this on your social network: