కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేయాలి
Published: Wednesday July 20, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం*
మంగళవారం రోజున గాంధీభవన్లోని జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి వేం నరేందర్ రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి చల్ల నరసింహారెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు మరియు బ్లాక్,మున్సిపల్,డివిజన్ అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ని ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం ఈడి విచారణ పేరుతో పిలవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వరకు వేలాది మందితో చేపట్టబోయే నిరసనర్యాలీలో రంగారెడ్డి జిల్లా నుండి అన్ని నియోజకవర్గాల వారిగా పెద్ద ఎత్తున వేలాదిగా పాల్గొనాలని తెలియజేయడం జరిగింది..
Share this on your social network: