పులిగండ్ల రంగయ్యకు నివాళులర్పించిన తుమ్మల నాగేశ్వరరావు

Published: Friday April 09, 2021
పాలేరు ఏప్రిల్ 8 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం: నేలకొండపల్లి మండలంలో కొత్త కొత్తూరు గ్రామంలో రిటైర్డ్ టీచర్ పులిగండ్ల రంగయ్య (86) మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు  ఉదయం నేలకొండపల్లి మండలం లో కొత్త కొతురు గ్రామం లో పులిగండ్ల రంగయ్య గారి పార్థివ దేహాన్ని కీ పులమాల వేసి నివాళులు అర్పించారు... ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సాదు రమేష్ రెడ్డి, నేలకొండపల్లి మాజీ ఏఎంసీ చైర్మన్ శాకమురి రమేష్, మాజీ మండల అధ్యక్షులు వెన్నే పూసల సీతారాములు, కొత్త కొత్తూరు సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, కడియాల శ్రీను, తదితరులు పాల్గొన్నారు