చెరువు తెగి నష్టపోయిన గొర్రెపల్లి రైతులు - ప్రభుత్వ సహాయమే శరణ్యం

Published: Monday July 26, 2021
మల్లాపూర్, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి): బారి వర్షాలతో చెరువు తెగి మెయిన్ రోడ్డుకు క్రింది భాగంలో ఒర్రెకు ప్రక్క భాగంలో ఉన్న వీర నర్సయ్యకు చెందిన నక్కల సాయి నూతి ఒర్రె యొక్క ఒడ్డు తెగి ఇసుక మరియు మట్టిలో కుడుకుపోయింది బావి మోటారు కాలిపోయింది. అలాగే రోడ్డుకు రొడ్డానికి పై భాగంలోఉన్న తలారి గంగానర్సయ్య పొలం పూర్తిగా కొట్టుకు పోయింది సదరు రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదిరి చూస్తున్నారు. వీరితో పాటు గ్రామంలో చామంది రైతుల పరిస్థితి ఇలాగే దయాణీయంగా మారింది గ్రామంలో నష్టపోయిన రైతులందరిని ఆదుకోవాలని రైతులందరు విజ్ఞప్తి చేసారు.