ఉత్తేజవంతులై సమన్వయంతో ముందుకు సాగుదాం
Published: Saturday December 31, 2022
వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 30 డిసెంబర్ ప్రజా పాలన : ఉత్తేజవంతులై సమన్వయంతో ముందుకు సాగుదామని కార్యకర్తలకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవుపలికారు. శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, అభిమానంతో పనిచేయాలన్నారు. మండలాల మాదిరిగానే ప్రతి గ్రామానికి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోని ముందుకు సాగాలన్నారు. తెలంగాణ రాష్టంలో మరో మారు అధికారం బిఆర్ఎస్ పార్టీదేనని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాలలో కీలకం కాబోతున్నామని ఉత్తేజవంతులై పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: