బీసీ బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలి: ఎస్ఎఫ్ఐ

Published: Thursday February 10, 2022

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 09, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో బీసీ బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు అజ్మీర భరత్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఈ హాస్టల్ ను వేరే ప్రాంతానికి తరలించారని, కానీ అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు హాస్టల్ ఇక్కడ వద్దంటూ అంటున్నారని. ఇప్పుడు విద్యార్థులు ఎక్కడ ఉండి ఎలా చదువుకోవాలి అనే సమస్యకు పరిష్కారం దొరకడం లేదని అన్నారు. ఇది ఇలానే ఉంటే ప్రభుత్వ విద్య పై ఆధారపడి చదువుకునే పేద విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహనికి సొంత భవనం నిర్మించాలి.లేని యెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, హరీష్, శ్రీధర్, మనోజ్, నవీన్, ప్రవీణ్, సుమన్ బీసీ హాస్టల్ బాయ్స్ తదితరులు పాల్గొన్నారని తెలిపారు.