శాంతి నిలయానికి అయ్యప్ప స్వాములు అరటి పండ్లు అందజేత
Published: Friday December 17, 2021
బోనకల్, డిసెంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ నివాసి అయిన అయ్యప్ప మాలాధారణ వేసిన అవునూరి కిరణ్ స్వామి తన పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలోని శాంతి నిలయం లో ఉన్న వికలాంగులకు అయ్యప్ప స్వాముల తో పాటు వచ్చి అరటిపండు లు అందజేశారు. కిరణ్ స్వామి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారి దీవెనలు ఎప్పుడూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రావినూతల అయ్యప్ప స్వాములు బాణోత్ గోపి స్వామి, సోమనబోయిన త్రినేష్, శివాజీ నరేష్, నాగరాజు, విక్రమ్, శ్రీనివాస్, ఇమ్రాన్, మరియు శాంతి నిలయం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: