మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన బోయ రాము మాదిగ
Published: Saturday November 19, 2022
చౌటుప్పల్,నవంబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా సర్వసభ్య సమావేశంలో పంతంగి గ్రామానికి చెందిన బోయ రాము మాదిగ ను జిల్లా ఉపాధ్యక్షలుగా ఎన్నికైనారు,ఈ సందర్భంగా బోయ రాము మాదిగ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ నాయకత్వం లో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహిస్తానన్నారు,తన ఎన్నికకు సహకరించిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ,జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బొడ్డు కృష్ణయ్య మాదిగ,చాట్ల స్వామి మాదిగ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: