భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘంలో చేరాలి

Published: Tuesday January 03, 2023
చేవెళ్ల జనవరి 2, ( ప్రజా పాలన):-

చేవెళ్ళ  నియోజవర్గంలోని మొయినాబాద్ మండలం నాగిరెడ్డి గూడా గ్రామానికి చెందిన భవన మరియు నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) రిజిస్ట్రేషన్ కొరకు దరఖాస్తు చేసారు.
ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ అధ్యక్షులు అల్లి దేవేందర్ నాగిరెడ్డి గూడా మాజీ సర్పంచ్ సద్గుణ చారి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు భవనిర్మాణ కార్మిక సంఘం లో చేరాలని అదేవిధంగా కార్మిక సంక్షేమ బోర్డులో తమ పేర్లను నమోదు చేసుకోవాలని భవన నిర్మాణ కార్మికులకు ఏదైనా సమస్య ఉంటే యూనియన్ వారికి అండగా ఉంటుందని అన్నారు.
భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికుల డబ్బులు అనేకం జమ అయ్యాయని వాటిని ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం ప్రభుదాస్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, వెంకటేష్, అర్జున్ సహాయ కార్యదర్శిలు రమేష్, మల్లేష్ కోశాధికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు