స్నేహితుని కుటుంబానికి 28వేల ఆర్థిక సహాయం
Published: Monday August 02, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 01 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని గోధుర్ గ్రామానికి చెందిన పొడేటి రవితేజ (29) సం అతను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అదే గ్రామానికి చెందిన అతని తోటి స్నేహితులు పదవ తరగతి మిత్రబృందం స్నేహితుని మరణంతో శోక సముద్రంలో మునిగినా అతని కుటుంబానికి మేమున్నామంటూ, తోటి స్నేహితుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి అతని కూతురు పేరు మీద 28000 రూపాయలను పోస్ట్ ఆఫీస్ లో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి ఆ పాస్ బుక్ ను స్నేహితుని భార్య తల్లికి అప్పగించారు. అనంతరం మిత్రబృందం వారు మాట్లాడుతూ తోటి స్నేహితుని మరణంతో బాధపడుతున్న కుటుంబీకులను ఓదారుస్తూ మీరు బాధ పడవద్దని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిత్రబృందం రామగిరి రవి, హరీష్, వినోద్ , నరేష్, ప్రశాంత్ ప్రసాద్, ఆనంద్ తదితరులు ఉన్నారు.
Share this on your social network: