భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా అభివృద్ధి : కార్పొరేటర్ హమీద్ పటేల్

Published: Thursday July 28, 2022
శేరిలింగంపల్లి - ప్రజా పాలన/ జూలై 27 :భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా అభివృద్ధి చేపడుతూ, పక్కా ప్రణాళికతో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. బుధవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజా రాజేశ్వరి కాలనీలో 50 లక్షలు అంచనా వ్యయంతో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విచ్చేసి పనుల తీరును పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులను పూర్తి చెయాలని కాంట్రాక్టర్ కు, జీహెచ్ఎంసి సిబ్బందికి సూచించారు. అభివృద్ధి పనులలో నాణ్యత లోపిస్తే సహించేది లేదని అన్నారు. అనంతరం రాజా రాజేశ్వరి కాలనీలో స్థానిక ప్రజలు, నాయకులతో కలసి పాదయాత్ర చేసి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని చోట్ల మిగిలి ఉన్న మంజీరా మంచి నీటి పైపు లైను పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజా రాజేశ్వరి కాలనీలో కొన్ని చోట్ల వివిధ రకాల మొక్కలను కార్పొరేటర్ హమీద్ పటేల్ స్థానిక నాయకులతో కలసి నాటారు. ఈ కార్యక్రమంలో రాజా రాజేశ్వరి కాలనీ ప్రెసిడెంట్ విజయకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, తెరాస సీనియర్ నాయకులు రూప రెడ్డి, దీపక్ కచ్చావా, శ్రీనివాస్ ముదిరాజ్, శ్రీకాంత్, శ్రవణ్, విశ్వేశ్వర రావు, శివ ముదిరాజ్, సంతోష్, వెంకటేశ్వర రెడ్డి, కొండల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
 
 
 
3 Attachments