మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు – అయ్యప్ప స్వామి వాఖ్యలపై క్షమాపణ చెప్పాలి – బైరీ నరేష్‌ను వె

Published: Saturday December 31, 2022

వికారాబాద్ బ్యూరో 30 డిసెంబర్ ప్రజాపాలన : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా వాఖ్యలు చేస్తే సహించేదిలేదని అయ్యప్ప సేవాదళ్ సభ్యులు అన్నారు. కోడంగల్‌లోని రావులపల్లిలో జరిగిన ఓ సమావేశంలో బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప జననంపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని అయ్యప్ప సేవాదళ్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. సమాజంలో అన్ని మతాలు అందరికి సమానమన్నారు. అందరు మతాలను, కులాలను గౌరవించాలన్నారు. అలాంటిది హిందూ దేవుళ్లపై మనోభావాలను దెబ్బతీసేలా వాఖ్యలు చేయడం పద్దతి కాదన్నారు. అయ్యప్ప స్వామి పుట్టుకపై బైరీ నరేష్ అనుచిత వాఖ్యలు చేయడం సహించేలేనిదన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మతపరమైన వాఖ్యలు చేసిన బైరీ నరేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వాఖ్యలు చేసిన బైరీ నరేష్‌ను అరెస్టు చేసి శించాలని డిమాండ్ చేశారు.