కృషి పట్టుదలుంటే దేనినాన సాధించవచ్చు ...విశ్రాంత కలెక్టర్ శర్వాన్ నాయక్

Published: Wednesday July 20, 2022
జన్నారం, జూలై 19, ప్రజాపాలన: 
కృషి పట్టుదలుంటే దేనినైన సాదిందవచ్చని
మంచిర్యాల జిల్లా జన్నారంమండలం కలమడుగు తండాకు చేందిన విశ్రాంత కలెక్టర్ శర్వాన్ నాయక్   అన్నారు, హైదరాబాద్ కలెక్టర్ గా భాద్యతలు నిర్వాహించి గత నెల ముప్పది తేదినా పదవి విరమణ పొందిన ఎల్ శర్వాన్ నాయక్ మంగళవారం జన్నారం మండల కేంద్రంలోని పైడిపెల్లి పంక్షన్ హల్ ప్రజా సంఘాల, కుల సంఘాల అదర్యంలో ఘనంగా సన్మానించారు, ఈ సందర్భంగా  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన తన ఎదుగుదలకు తల్లిదండ్రులు విధ్యనేర్పిన ఉపాధ్యాయులచే కారణమన్నారు, చిననాటి నుండి ఉన్నత స్థానంలో ఉండలనే పట్టుదల ఉండేదని దానికి తగ్గట్టుగానే చదువుకొని అనుకున్న ఉద్యోగం సాదించనాని అన్నారు,తెలంగాణ ఎన్నో ప్రాంతాల్లో వివిధ హోదాలో విధులు నిర్వహించిన స్వంత మండలంలోనే ఎప్పుడు తన ద్యాస ఉండేదని ఇక్కడ ప్రజలకు ఎప్పటికి మరచిపోనాని అన్నారు, ఈ కార్యాక్రమంలో రేండ్లగూడ సర్పంచ్ నేమళికోండ అశారాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోర్లకుంట ప్రబుదాస్, కాంగ్రెస్ నియోజకవర్గ యుత్ మాజీ అధ్యక్షుడు ముజాఫర్ అలీఖాన్, సిపిఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.