అభివృద్ధికి నోచుకోని కోరుట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ టిటిడి కళ్యాణ మండపంని ఇప్పటి వరకు ఎ

Published: Wednesday January 04, 2023

కోరుట్ల, జనవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కి నోచుకోవడం లేదుఅని టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీమంత్రి వర్యులు జువ్వాడి రత్నాకర్ రావు  వెంకటేశ్వర స్వామి ఆలయం టిటిడి కల్యాణ మండపం మంజూరు చేపించారు కానీ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  టిటిడి కల్యాణ మండపంని ఎందుకు తెరిపించడం లేదు అని అన్నారు.టిటిడి కళ్యాణ మండపం ఓపెన్ చేస్తే పేద ప్రజలు అందులో వివాహాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది తక్కువ ఖర్చుతో పెదప్రజలు శ్రీ వారి సన్నిధిలో వివాహాలు జరుపుకోవచ్చు అని టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు అన్నారు.విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే అయినక కోరుట్ల వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నలాగా ఉందని టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణ రావు అన్నారు. అదేవిధంగా  నిన్న జరిగిన ముక్కోటి ఏకాదశి వేడుకలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో క్యూ లైన్ లు ఏర్పటు చేయలేదు .భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం తో తొక్కిసలాట జరిగింది అని భక్తులకు ఏదైనా జరగ రాని సంఘటన జరుగుతే ఎవరు బాధ్యత వహిస్తారు అని అన్నారు. కనీసం ఆలయం ముందు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పటు చేయలేదు అని అన్నారు.