కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ లో పలు సేవా కార్యక్రమాలు

Published: Wednesday February 16, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడు రోజుల సంబరాలలో భాగంగా ఖైరతాబాద్ డివిజన్ లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఖైరతాబాద్ ఎం ఎల్ ఏ దానం నాగేందర్.... మొదట కుందన్ బాగ్ లోని ఆశ్రయ్ ఆకృతి మూగ చెవిటి బాల బాలికల పాఠశాల పిల్లలతో కేక్ కట్ చేయించి, బట్టలు, పండ్లు పంపిణీ చేసి తదనంతరం నిమ్స్ ఆసుపత్రిలోని క్యాన్సర్ విభాగంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు, ఆ తరువాత ద్వారకాపురి కాలనిలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు అభివృద్ధి పథకాలను చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బావుండాలని మూడు రోజుల ముందు నుండి సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ ల కార్పొరేటర్ లు, టీఆరెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.