1.50 వ్యయంతో డ్రైన్ బాక్స్ నిర్మాణ పనులు

Published: Thursday May 27, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : వచ్చే వర్షాకాలంలో ఎలాంటి వరద సమస్య తలెత్తకుండా ఉండాలని అన్నారు. మీర్ పేట్  మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 19 వ డివిజన్ అంబేద్కర్ నగర్ శ్రీ నల్ల పోచమ్మ గుడి నుండి గాయత్రి నగర్ ఎక్స్ రోడ్ వరకు ఫోర్ బై ఫోర్ బాక్స్ డ్రైన్  నిర్మాణ పనులు బుధవారం నాడు స్థానిక కార్పొరేటర్ బైగళ్ల బాలమణి యాదయ్య  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో సుమారు కోటి యాభై లక్షల రూపాయల నిధులతో ఈ బాక్స్ డ్రైన్ నిర్మాణము చేపట్టనున్నారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి వరద సమస్య తలేతకుండా ఉంటుందని ఈ నిర్మాణ  అధికారులు వివరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బైగళ్ల ఓంప్రకాష్, ఈస్ట్ గాయత్రి నగర్ అధ్యక్షులు కొత్త వెంకటయ్య, కార్యదర్శి శ్రీరామ్ నాయక్, జిహెచ్ఎంసి ఏ.ఈ సంబంధిత అధికారులు కాలనీ వాసులు తదితరులు  పాల్గొన్నారు.