1.50 వ్యయంతో డ్రైన్ బాక్స్ నిర్మాణ పనులు
Published: Thursday May 27, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : వచ్చే వర్షాకాలంలో ఎలాంటి వరద సమస్య తలెత్తకుండా ఉండాలని అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 19 వ డివిజన్ అంబేద్కర్ నగర్ శ్రీ నల్ల పోచమ్మ గుడి నుండి గాయత్రి నగర్ ఎక్స్ రోడ్ వరకు ఫోర్ బై ఫోర్ బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు బుధవారం నాడు స్థానిక కార్పొరేటర్ బైగళ్ల బాలమణి యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో సుమారు కోటి యాభై లక్షల రూపాయల నిధులతో ఈ బాక్స్ డ్రైన్ నిర్మాణము చేపట్టనున్నారు. రాబోయే వర్షాకాలంలో ఎలాంటి వరద సమస్య తలేతకుండా ఉంటుందని ఈ నిర్మాణ అధికారులు వివరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బైగళ్ల ఓంప్రకాష్, ఈస్ట్ గాయత్రి నగర్ అధ్యక్షులు కొత్త వెంకటయ్య, కార్యదర్శి శ్రీరామ్ నాయక్, జిహెచ్ఎంసి ఏ.ఈ సంబంధిత అధికారులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: